Monday 3 October 2011

కనకదుర్గను దర్శించుకున్న అల్లు అర్జున్

విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని సినీ హీరో అల్లు అర్జున్ దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అల్లు అర్జున్ దంపతులకు ఆలయ ఈవో అమ్మవారి దర్శనాన్ని చేయించారు. ఈ సందర్భంగా పండితులతో అమ్మవారి శేష వస్త్రం కప్పి, ప్రసాదాలను అందచేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.