Monday 3 October 2011

ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటి

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌తో కేసీఆర్, తెలంగాణ జేఏసీ నాయకుల సమావేశం ముగిసింది. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రధాని జేఏసీ నేతలు కోరినట్టు తెలిసింది. ఈ మేరకు నాలుగు డిమాండ్‌లతో కూడిన లేఖను జేఏసీ నేతలు ప్రధానికి సమర్పించారు. ప్రధానితో సమావేశం సుమారు 40 నిమిషాలపాటు సాగింది.